మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం…గవర్నర్ తో సీఎం భేటీ…?
TeluguStop.com
నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.ఈ విషయమై నేడు (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు రాజభవన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలిసి మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ తో చర్చించే అవకాశం ఉందని,
ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
మొదటిసారి జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కొత్తగా నలుగురికి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది.