తండ్రిని కత్తితో పొడిచి హత్య చేసిన కొడుకు.. కారణం ఏంటంటే..?

కుటుంబాలలో ఏర్పడే మనస్పర్ధలు చివరికి దారుణ హత్యలకు దారితీస్తున్నాయి.గతంలో బయటి వ్యక్తుల నుంచి గొడవల కారణంగా ప్రాణహాని ఉండేది.

కానీ ఈ మధ్యకాలంలో మనస్పర్దల వల్ల కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఏర్పడుతోంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

ఇలాంటి కోవలోనే తల్లిని కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టిన తండ్రి పై పగ పెంచుకున్న కొడుకు అవకాశం కోసం ఎదురుచూసి కత్తితో పొడిచి తండ్రిని దాడి చేసిన ఘటన ఝార్ఖండ్( Jharkhand ) లోని పలాము లో చోటుచేసుకుంది.

సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం. """/" / వివరాల్లోకెళితే.

జార్ఖండ్ లోని పలాము జిల్లా( Palam ) పక్రియా గ్రామానికి చెందిన చోటు శర్మ (42) అనే వ్యక్తి మంగళవారం తన భార్యతో గొడవపడి విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు.

ఆ మహిళ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. """/" / అయితే తన తల్లిని కొట్టి ఇంటి నుండి గెంటేసిన తండ్రిపై పదహారేళ్ల కుమారుడు కోపంతో రగిలిపోయాడు.

అవకాశం కోసం ఎదురుచూసి బుధవారం తండ్రి చోటు శర్మను కత్తితో పొడిచి చంపేశాడు.

హత్య అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.బంధువులు చోటా శర్మ ఇంటికి వచ్చి చూడగా విగతజీవిగా పడి ఉండడం చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు( Police ) మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసి తండ్రిని హత్య చేసి పారిపోయిన కుమారుడి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

కని పెంచిన కన్న కొడుకే తండ్రిని హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

నీటిలో నానుతున్న విజయవాడ.. బ్రహ్మం గారి కాలజ్ఞానం పైనే చర్చ