చరిత్రలోనే తొలిసారిగా 83 రూపాయల దిగువకు రూపాయి విలువ

రూపాయి నేల చూపులు చూస్తోంది.గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న రూపాయి విలువ నిన్న చరిత్రలోనే తొలిసారిగా 83 రూపాయల దిగువకు పడిపోయి ఆల్‌టైం కనిష్ఠానికి చేరుకుంది.

82.30 వద్ద నిన్న ట్రేడింగ్ ప్రారంభం కాగా, ఆ తర్వాత ఒక దశలో 82.

95 రూపాయలకు పడిపోయింది.మంగళవారం నాటి క్లోజింగ్‌తో పోలిస్తే నిన్న ఒక్క రోజే 61 పైసలు క్షీణించి 83.

02 దిగువకు పడిపోయింది.83 కిందికి పడిపోవడం చరిత్రలోనే ఇది తొలిసారి.

బుధవారం సెషన్ ఆరంభంలో రూపాయి సానుకూలంగానే ట్రేడ్ అయింది.అయితే, ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది.

ఇది మరింత పతనమై 83.50 దిగువకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలు, రిజర్వు బ్యాంకు డాలర్లను కొనుగోలు చేయడంతో రూపాయి విలువ తగ్గిందని బ్యాంకర్లు చెబుతున్నారు.

రూపాయి పతనం కొనసాగుతుండడంతో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీరేట్లను పెంచడంపై భారతీయ రిజర్వు బ్యాంకు దృష్టి సారించే అవకాశం ఉందని చెబుతున్నారు.

హమ్మయ్య బన్నీకి రిప్లై ఇచ్చిన పవన్… విభేదాలు మొత్తం తొలగిపోయినట్టేనా?