సెలవులు ముగిసేలోగా మరమ్మతు పనులు పూర్తి చేయాలి

వట్టెంల, ఫాజుల్ నగర్లో పాఠశాలలను పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లా :వేసవి సెలవులు ముగిసేలోగా ఆయా పాఠశాలల్లో మౌలిక వసతుల మరమ్మతు పనులు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కింద వేములవాడ రూరల్ మండలం లోని వట్టెంల, ఫాజుల్ నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చేయనున్న మరమ్మతు పనుల ప్రణాళికను కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి తో కలిసి పరిశీలించారు.

అనంతరం ఆయా స్కూల్ లలో తరగతి గదులు, మరుగు దొడ్లు, నీటి వసతి, విద్యుత్ సౌకర్యాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మ ఆదర్శ పాఠశాల కింద తరగతి గదులు, మరుగు దొడ్ల లో మరమ్మతు పనులు చేయించాలని సూచించారు.

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తాగు నీటి వసతి కల్పించాలని ఆదేశించారు.తరగతి గదులలో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అవసరం మేరకు ఏర్పాటు చేయాలని వివరించారు.

ఆయా పనులు త్వరగా మొదలు పెట్టి నాణ్యతా ప్రమాణాల ప్రకారం పూర్తి చేయించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.

ఇక్కడ జడ్పీ సీఈవో ఉమారాణి, డీఈఓ రమేష్ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పుష్ప కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా..? లాంగ్ రన్ లో పుష్ప కలెక్షన్స్ ఎంత రావచ్చు..?