యువతితో సంబంధం గుట్టు రట్టవుతుందని.. 8 సంవత్సరాల చిన్నారిని చిదిమేసిన చిన్నాన్న

రోజురోజుకూ మానవ సంబంధాలు మరింతగా క్షీణిస్తున్నాయి.వావి వరుసలు లేకుండా పోతున్నాయి.

తమకు నచ్చిందే వేదం అన్నట్లు కొంత మంది వ్యవహరిస్తున్నారు.తమ గుట్టును ఎవరైనా బయటపెడతారని భావిస్తే వారిని అంతమొందించేందుకు కూడా వెనుకాడడం లేదు.

వారు ఎవరు.తమకు ఏమవుతారు.

అనే విషయాలను మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు.ముక్కు పచ్చలారని చిన్నారులను చిదిమేస్తున్నారు.

ఇటువంటి ఘటనే ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

చిత్తూరు జిల్లాలోని కలికిరి మండలం అద్దవారి పల్లెలో ఈ నెల 12వ తేదీన ఒక మర్డర్ జరిగింది.

ముక్కు పచ్చలారని 8 సంవత్సరాల బాలుడిని దుండగులు పొట్టన పెట్టుకున్నారు.అతి కిరాతంగా చెట్టుకు ఉరేసి మర్డర్ చేశారు.

ఈ మర్డర్ కేసును చిత్తూరు జిల్లా పోలీసులు చాలెంజింగ్ గా తీసుకున్నారు.ఈ ఘటనపై విచారణ చేసిన పోలీసులకు షాకయ్యే నిజాలు తెలిసాయి.

ఆ బాలుడిని ఎవరో చంపలేదు.స్వయానా బాలుడి చిన్నాన్నే పొట్టన పెట్టుకున్నాడని తెలిసి పోలీసులు షాక్ తిన్నారు.

బాలుడి సొంత చిన్నాన్న అయిన సహదేవ, అదే గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే యువతితో సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయాన్ని కిరణ్ అనే 8 సంవత్సరాల చిన్నారి చూశాడు.దీంతో గాబరాపడిన సహదేవ, రాజేశ్వరి తమ సంబంధం గుట్టు రట్టవుతుందేమోనని చాలా టెన్షన్ పడ్డారు.

చివరికి తమ సంబంధం గురించి తెలిసిన చిన్నారి కిరణ్ ను పొట్టన పెట్టుకున్నారు.

అత్యంత పాశవికంగా చెట్టుకు ఉరేసి చంపారు.మళ్లీ ఏమీ తెలియని నంగనాచుల్లా సైలెంట్ గా ఉన్నారు.

కానీ ఈ విషయాన్ని చాలా చాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు వారం వ్యవధిలోనే హత్యకేసును చేధించారు.

హత్య చేసిన వారి వివరాలను వెల్లడించారు.

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఈ రెండు సూపర్ హిట్ సినిమాలకి మధ్య ఉన్న తేడాలు ఇవేనా..?