భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతోన్న గోదావరి
TeluguStop.com
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరికి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది.
ప్రస్తుతం నీటిమట్టం 47.90 అడుగులుగా ఉండగా.
ఎగువ నుండి గోదావరికి 11,39,230 క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు తెలిపారు.ఈ క్రమంలో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది.
ప్రస్తుతం నీటిమట్టం 15.10 అడుగులకు చేరుకోగా.
బ్యారేజీ నుంచి 14,94,850 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి ప్రవహిస్తోంది.
ఆర్య తర్వాత దిల్ రాజు బ్యానర్ లో సుకుమార్ సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి..?