రేపటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ 

సార్వత్రిక ఎన్నికలకు( General Elections ) సంబంధించి తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కు సంబంధించి నామినేషన్ల ను దాఖలు చేసేందుకు రేపటితో గడువు ముగియనుంది.

దీంతో ఈరోజు , రేపు భారీ ఎత్తున నామినేషన్ల ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది.

ఇప్పటికే భారీగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.నాలుగో దశలో తెలంగాణ లో 17 పార్లమెంట్ స్థానాలకు ఏపీలో 25 పార్లమెంట్ 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి .

ఏపీ,  తెలంగాణతో పాటు , బీహార్ , జార్ఖండ్ , మధ్యప్రదేశ్,  మహారాష్ట్ర , ఒరిస్సా , యూపీ, బెంగాల్ , జమ్మూ కాశ్మీర్ లోని మొత్తం 96 లోక్ సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగబోతోంది.

దీంతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. """/" / ఇప్పటికే తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు సంబంధించి నిన్నటి వరకు మొత్తం 415 నామినేషన్ దాఖలు అయ్యాయి .

ఏపీలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు( 25 Parliamentary Constituencies ) 417 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

అలాగే ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2,350 నామినేషన్ దాఖలు అయ్యాయి .

నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 18 విడుదల అవ్వగా,  వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

  ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ రేపటితో నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగియనుంది.

ఈనెల 26న నామినేషన్లను పరిశీలిస్తారు . """/" / నామినేషన్ల ఉపసంహరణకు 29వ తేదీ గడువు ఉంది .

ఇక మే 13న ఎన్నికల పోలింగ్ జరుగుతుంది .జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

ఇప్పటికే ఏపి , తెలంగాణలోని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం పై దృష్టి సారించాయి.

ఇలా ఆయా పార్టీల అధినేతలు , పార్టీ కీలక నాయకులు నిత్యం జనాల్లోనే ఉంటూ ప్రజా బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

తమను , తమ పార్టీని గెలిపించాల్సిందిగా జనాలను కోరుతూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టాయి.

భార్యను వదిలేస్తానన్న పూరి జగన్నాథ్.. ఆ చిన్న కారణానికే..??