రూ.100లా కనిపించే ఈ చెప్పుల ధర అక్షరాలా రూ.8,990.. అంత స్పెషల్ ఏంటంటే!
TeluguStop.com
సాధారణంగా ప్రజలు ఇల్లు, వాష్రూమ్, ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరగడానికి స్లిప్పర్స్ కొంటారు.
వీటి ధర మహా అంటే రూ.500 లోపు ఉంటుందని చెప్పవచ్చు.
కానీ ఒక బ్రాండ్ మాత్రం ఈ తరహా చెప్పులను ఏకంగా రూ.19,500కు విక్రయిస్తోంది.
కాగా ప్రస్తుతానికి డిస్కౌంట్ పోను ఆ చెప్పుల ధర రూ.8,990గా ఉంది.
ఈ ధర కూడా చాలా ఎక్కువే.చూసేందుకు ఈ చెప్పులు చాలా సాధారణంగా కనిపించాయి.
బజార్లపై వంద రూపాయలకు దొరికే చెప్పుల్లాగా ఉన్నాయి.మరి దీనికి ఇంత ధర ఎందుకూ అంటే అది ఒక లగ్జరీ బ్రాండ్ అట.
ఈ కంపెనీ తీసుకువచ్చే చెప్పుల ధర ఎప్పుడూ ఇదే రేంజ్లో ఉంటుందట.గతంలో గూచీ కంపెనీ కఫ్తాన్ కుర్తాలను రూ.
2.56 లక్షలకు విక్రయించి అందరికీ షాక్ ఇచ్చింది.
ఇక బాలెన్సియాగా కంపెనీ చెత్త పార బోసే కవర్ ధర రూ 1.
42 లక్షలుగా నిర్ణయించింది.ఒక్కోసారి ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటే మతి పోతుంది.
ఇప్పుడు కూడా హ్యూగో బాస్ కంపెనీ బ్లూ కలర్ ఫ్లిప్-ఫ్లాప్ స్లిప్పర్లను రూ.
8,990కి విక్రయించడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. """/"/
కొనాలనుకునేవారు నెలకు రూ.
500 కడుతూ ఈఎంఐ పద్ధతిలో వీటిని తీసుకోవచ్చట.నిజానికి ఈ చెప్పులలో ప్రత్యేకత ఏమీ లేదు.
బ్రాండ్ అనే పేరు తప్ప.అయినా ఇంట్లో తిరిగే చెప్పుల బ్రాండ్ ఎవరు చూస్తారు చెప్పండి! అయినా కూడా కొందరు జస్ట్ బ్రాండ్ నేమ్ చూసి కొనేస్తుంటారు.
దీనికి సంబంధించి ఒక ట్విట్టర్ యూజర్ "ఇంత ధర ఏంటి, బాబోయ్" అంటూ ట్వీట్ చేశాడు.
వీటి ధర చూసిన నెటిజన్లు స్టన్ అవుతున్నారు.వేయి రూపాల కంటే తక్కువ ధరలో మంచి స్లిప్పర్స్ కొనుగోలు చేయవచ్చని అంటున్నారు.
విమాన ప్రయాణంలో కుక్క మృతి.. అలస్కా ఎయిర్లైన్స్పై యజమాని కేసు..