తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన చేపట్టిన పార్టీ హైకమాండ్..!!

తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన జరగనుంది.ఇందులో భాగంగా గీత దాటిన వారిపై వేటు వేసేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధమైంది.

ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగిందని తెలుస్తోంది.

పార్టీలో వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

ఇందుకోసం ఇప్పటివరకు పార్టీ శ్రేణుల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించిన పార్టీ అధి నాయకత్వం మీడియా సహా సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం.

ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మాట్లాడిన అనంతరం చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది.

ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

రూ.100 కోట్ల బడ్జెట్ తో రిస్క్ చేస్తున్న న్యాచురల్ స్టార్.. ఈ సమయంలో అవసరమా?