ఖమ్మంలో కొనసాగుతున్న భట్టి పాదయాత్ర

ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది.ప్రస్తుతం ఖమ్మం పట్టణంలో పాదయాత్ర కొనసాగుతుంది.

ప్రజల దీవెనలు, ఆశీస్సులతో పాదయాత్ర దిగ్విజయంగా జరుగుతోందని భట్టి విక్రమార్క తెలిపారు.రేపు ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనుంది.

ఈ క్రమంలో భట్టి భారీ పాదయాత్రతో సభకు హాజరుకానున్నారని తెలుస్తోంది.కాగా ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.

ఈ సభా వేదికపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ప్రముఖులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారన్న సంగతి తెలిసిందే.

ఫైర్ బ్రాండ్ బ్యూటీ రాశి ఖన్నా రెడ్ హాట్ అవుట్ ఫిట్స్