వైరల్ వీడియో: ఇదేందయ్యా ఇది.. బుల్డోజర్ పై ఊరేగిన నూతన దంపతులు..

ప్రస్తుత సోషల్ మీడియా( Social Media ) యుగంలో ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికి ఇట్లే తెలిసిపోతుంది.

దీనితో ఇదే ఆసరాగా తీసుకొని కొంత మంది వ్యక్తులు సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఫేమస్ అవ్వడానికి కోసం ఎలాంటి సాహసానికి గాని వెనక అడుగు కూడా వేయరు.

అయితే తాజాగా ఒక నూతన జంట చేసిన పని అందరిని ఆకట్టుకుంటుంది.వివాహ వేడుకలలో భాగంగా ఒక జంట బుల్డోజర్ పై ఇంటికి వెళ్లిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) కు చెందిన కృష్ణ వర్మ అనే వ్యక్తి వివాహం చేసుకున్న అనంతరం నూతన వధువుతో కలిసి తన ఇంటికి వచ్చే క్రమంలో బుల్డోజర్ పై ఊరంతా ఊరేగడం ఊరందరి ప్రజలకికి ఆశ్చర్యానికి గురి చేశాడు.

వధూవరులు ఇద్దరు కలిసి బుల్డోజర్ పై కూర్చుని వరుడు ఇంటికి వెళ్లారు.ఇది ఇలా ఉండగా ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్( CM Yogi Adityanath ) తరచుగా తన రాజకీయ ప్రత్యర్థులపై బుల్డోజర్ తో ఇంటిని కూల్చి వేస్తానని అంటూ హెచ్చరిస్తూ ఉండడం పలుసార్లు వార్తలలో వచ్చిన సంగటనలు చూసే ఉంటాము.

"""/" / అందుకు తగ్గట్టుగానే రాజకీయ పద్ధతులు అదేవిధంగా పలువురుపై ఈ బుల్డోజర్ అస్త్రం అంటూ యోగి ఆదిత్యనాథ్ ప్రయోగించారు.

ఇక ఏది ఏమైనా కానీ ఈ వధూవరులు బుల్డోజర్ పై ఇలా ఊరంతా తిరగడం అక్కడ ప్రజలను బాగా ఆకట్టుకుంది.

వీడియో చూసి మీకు ఏమనిపించిందో కామెంట్లో తెలపండి.

వీడియో వైరల్: నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రిస్క్ చేసి భలే పట్టేసాడుగా..