TRS పాలన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది-కిషన్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ రేపటి బహిరంగ సభకు ఎంతో ప్రాధాన్యత ఉంది కేంద్రం పై,బిజెపి పై తప్పుడు ప్రచారం తండ్రి కొడుకుల ప్రభుత్వం చేస్తుంది.

విషం కక్కుతున్నారు TRS పాలన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది బడ్జెట్ లో పెట్టినట్టుగా ఖర్చు చేయడం లేదు తెలంగాణ పూర్తి గా అభివృద్ధి చేసిన ఇక దేశాన్ని ఉద్దరించాలని పగటి కలలు కంటున్నారు.

పగటి కలలకు ఖర్చు ఉండదు ఆయన కుటుంబ పాలనను ప్రజల మీద రుద్దారు.

ఈ రాష్ట్రం అంతా కల్వకుంట్ల గుప్పిట్లో ఉండాలని అనుకుంటున్నారు కల్వకుంట్ల కుటుంబమ్ పైన తీవ్ర వ్యతిరేకత.

ఆ కుటుంబాన్ని ప్రజలు చిదరించుకుంటున్నరు ఇంటింటికి డబ్బులు పంపించిన గ్రేటర్ లోగెలవలేక పోయారు.

హుజూరబాద్ లో వేల కోట్లు ఖర్చు చేసి, దుర్మార్గపు పనులు చేసిన ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు.

రేపటి సభను బారి ఎత్తున నిర్వహిస్తున్నాం స్పష్టమైన సందేశం అమిత్ షా ఇవ్వబోతున్నారు కుటుంబ, అవినీతి పాలనకు చరమ గీతం పాడాలని అమిత్ షా పిలుపు ఇవ్వబోతున్నారు.

సంజయ్ యాత్రకు భారీ స్పందన వస్తుంది TRS ప్రభుత్వం రైతులకు మేమే అన్ని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నది వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీప్పి కొట్టాం.

రైతులకు వాస్తవాలు చెప్పాము.రైతుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం తప్పేమీ లేదు.

మెడికల్ కాలేజీల పై మెడికల్ కాలేజి ల మంజూరు విషయం లో తండ్రి కొడుకుల ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది అబద్ధాలు చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వము అడిగిన ఫార్మాట్ లో వారు ధరకాస్తు చేశారా.

కేంద్రం పై ఉమ్మి వేయాలని అనుకుంటే అది మీ మొఖం మీదనే పడుతుంది.

కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి.

Samantha Naga Chaitanya : సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోడానికి ఫోన్ ట్యాపింగ్ కారణమా?