నిజామాబాద్ ఘటనపై స్పందించిన జిల్లా ఆస్పత్రి యాజమాన్యం
TeluguStop.com

నిజామాబాద్ ఘటనపై జిల్లా ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది.రోగిని తల్లిదండ్రులు 31న రాత్రి 10 గంటల సమయంలో తీసుకు వచ్చారని యాజమాన్యం తెలిపింది.


దీంతో రోగిని పరీక్షించి ఇతర సమస్యలు ఉన్నాయని వైద్యులు చెప్పారు.ఉదయం ప్రత్యేక వైద్యులను సంప్రదించాలని సూచించారు.


ఈ క్రమంలోనే ఉదయం 8.30 గంటలను రోగిని రెండో అంతస్తుకు తీసుకెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది వీల్ ఛైర్ తీసుకువచ్చారు.
అయితే ఆ లోపే లిఫ్ట్ వచ్చిందని రోగిని లాక్కెళ్లారని యాజమాన్యం వెల్లడించింది.సరైన అవగాహన లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీనిపై మధ్యాహ్నం ఆస్పత్రి సూపరింటెండెంట్ మీడియా సమావేశం నిర్వహిస్తామని వెల్లడించింది.
ఆహా ఏమి ట్రిక్కు గురూ.. సూట్కేసులతో బైక్ రైడ్.. థాయ్లాండ్లో టూరిస్ట్ తెలివైన ఐడియా!