చేతన్ ను అభినందించిన జిల్లా గిరిజన సంఘం నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(Yellareddypet ) మండల కేంద్రానికి చెందిన రాపల్లి సాయి చేతన్( Rapalli Sai Chetan ) నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా ప్రభుత్వ కొలువు సాధించిన నేపథ్యంలో అఖిలభారత బంజారా సంఘం నాయకులు ఆదివారం శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా బంజారా సంఘం నాయకులు మాట్లాడుతూ కష్టపడితే దేన్నైనా సాధించవచ్చు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అజ్మీరా రాజు నాయక్, మండల అధ్యక్షుడు దేవిలాల్ నాయక్, సర్పంచులు భూక్యా ప్రభు నాయక్, పుణ్యా నాయక్, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కళ్యాణ్ నాయక్, లింగం నాయక్ పాల్గొన్నారు.

రెండో బిడ్డ పుట్టాక ఇంటి నుంచి టెంట్‌కి మారిన తండ్రి.. ఎందుకో తెలిస్తే..?