సినిమా మార్నింగ్ షో ఫ్రీ.. చూసిన తర్వాత ఆ పని చెయ్యండి!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు ఎంటర్ అవుతూ వారి నటన నైపుణ్యాన్ని నిరూపించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే చాలా మంది కొత్త నటీనటులు పలు సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ది కిల్లర్‌ఇందులో కార్తీక్ సాయి సరసన డాలీషా, నేహాదేశ్‌పాండే హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు.

కార్తీక్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఆవుల రాజుయాదవ్‌, సంకినేని వాసుదేవరావు నిర్మించారు.

ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

మంత్రి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా సోహైల్ బిగ్ టికెట్ ను ఆవిష్కరించారు.

ఈ క్రమంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతోమంది నటీనటులు సినిమారంగంలోకి వస్తున్నారని తెలియజేశారు.

"""/"/ ఈ క్రమంలోనే కార్తీక్ సాయి మాట్లాడుతూ.సెప్టెంబర్ 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అన్ని థియేటర్లలో మొదటి షో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఉచితంగా చూడవచ్చని తెలియజేశారు.

అయితే ఈ సినిమా థియేటర్ లో ఉచితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా బయట ఈ సినిమా గురించి పది మందికి తెలియజేయాలని ఈ సందర్భంగా కార్తీక్ సాయి తెలియజేశారు.

అర్ధరాత్రి బాస్ నుండి మహిళా ఉద్యోగికి మెసేజ్.. ఏంటా అని చూస్తే.!