దమ్మాయిగూడలో బాలిక అదృశ్యం ఘటన విషాదాంతం

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని దమ్మాయిగూడలో బాలిక అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది.దమ్మాయిగూడ చెరువులో బాలిక ఇందు మృతదేహం లభ్యమైంది.

నిన్న ఉదయం స్కూల్ వెళ్లిన ఇందు కనిపించకుండా పోయింది.తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో పాప చివరిసారిగా చెరువువైపు వెళ్తున్నట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది.

ఈ క్రమంలోనే చెరువులో ఇందు మృతదేహాన్ని గుర్తించారు.దీంతో జవహర్ నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఓరి దేవుడా.. ఒక్క చేతితో సమోసాలు వేయించి.. మరుగుతున్న నూనెతో ఏకంగా.?