ఆ డైమండ్ రింగ్కు గిన్నిస్ రికార్డు.. ప్రత్యేకతలివే
TeluguStop.com
వజ్రాలు అంటే ఇష్టపడని వారు ఉండరు.అయితే వజ్రాలతో అందమైన ఆభరణాలు చేయిస్తే, ముఖ్యంగా ధనవంతులు వాటిని కొనుగోలు చేయడానికి మక్కువ చూపుతారు.
ఇలాంటి వారిని ఆకర్షించేందుకు పలు సంస్థలు అందమైన ఆభరణాలను తయారు చేస్తుంటాయి.ఇదే కోవలో ఓ సంస్థ తయారు చేసిన వజ్రాల ఉంగరానికి ఏకంగా గిన్నిస్ రికార్డు దక్కింది.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన జ్యువెలర్స్ కంపెనీ అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకోవడంలో ఇప్పటికే ప్రసిద్ధి చెందింది.
అయితే ఈసారి ఆభరణాల తయారీ సంస్థ 'ఒక ఉంగరంలో అత్యధిక వజ్రాలను' అమర్చినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకోగలిగింది.
ఎస్డబ్ల్యుఏ డైమండ్స్ ఆభరణాల సంస్థ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని అందుకుంది.సంస్థ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం, రింగ్ పింక్ ఓస్టెర్ మష్రూమ్ నుండి ప్రేరణ పొందింది.
ఇది అమరత్వం, దీర్ఘాయువుని సూచిస్తుంది.'అమీ' లేదా 'ది టచ్ ఆఫ్ అమీ' అనే పుట్టగొడుగుల నేపథ్యం ఉన్న ఉంగరంలో మొత్తం 24,679 సహజ వజ్రాలు అమర్చబడి ఉన్నాయి.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుండి లైఫ్స్టైల్ యాక్సెసరీ డిజైన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన రిజిషా దీనిని తయారు చేసింది.
ఈ డైమండ్ రింగ్ తయారు చేయడానికి 90 రోజులు పట్టింది.రింగ్లో 41 ప్రత్యేకమైన పుట్టగొడుగుల రేకులను, ప్లాస్టిక్ అచ్చును ఉపయోగించి రూపొందించారు.
త్రీడీ ప్రింటింగ్ ద్వారా డిజిటల్గా దానిని తొలుత తయారు చేశారు.ఆ తర్వాత, వజ్రాలు ఒక్కొక్కటిగా రేకుల ప్రతి వైపు అమర్చారు.
చివరగా, మష్రూమ్ రూపాన్ని ఇవ్వడానికి పుట్టగొడుగు ఆకారాన్ని వృత్తాకార ఆకారంలో ఉంచారు.ఆపై ఆభరణాల భాగాన్ని పూర్తి చేయడానికి దాన్ని అమర్చారు.
ఈ అరుదైన ఉంగరం ధర 95,243 డాలర్లు.అంటే భారత కరెన్సీలో సుమారు రూ.
76,08,787 అని సంస్థ వెల్లడించింది.
డ్రామాలొద్దు .. ఇమ్మిగ్రేషన్ విధానాలపై ట్రంప్కు షాకిచ్చేలా కమలా హారిస్ ప్రకటన