మండపంలో మిస్సైన వరుడు... వధువుని మెచ్చుకున్న అతిథులు, విషయమిదే!

అక్కడ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది.మరికాసేపట్లో పెళ్లి అనగా వరుడు హఠాత్తుగా మాయమయ్యాడు.

ఈ సంగతి తెలుసుకున్న వధువు గుండె జారిపోయింది.అయితే కాసేపటికి తేరుకొని వరుడు లేకుండానే పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది.

పెళ్లికొడుకు లేకుండానే పెళ్లి ఫొటోలను కూడా క్లిక్ మనిపించారు.ఎలాగో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.

బ్రిటన్‌లోని వేల్స్‌లో నివసిస్తున్న కైలీ స్టెడ్ వివాహం సెప్టెంబర్ 15న జరగాల్సి ఉంది.

ఈ వివాహ నిర్వహణకు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేశారు.

ఆహూతులందరూ విందుభోజనాలను ఎంజాయ్ చేసారు.మరికాసేపట్లో రింగ్స్ మార్చుకుంటారు అనుకుంటుండగా వరుడు మాయమయ్యాడని వధువు కైలీకి తెలిసింది.

ఇది విన్న కైలీకి దిక్కుతోచలేదు.అయితే ఇలా జరిగినప్పటికీ అతిథి మర్యాదలు పాటించడంతో పాటు వివాహ కార్యక్రమాలన్నీ పూర్తిచేసింది.

బీమా కంపెనీలో పనిచేస్తున్న కైలీ, తాను వరుడి కోసం 4 గంటల పాటు వేచి ఉన్నానని చెప్పింది.

పలుమార్లు అతనిని సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదని, అతను ఇక రాదని క్లారిటీ వచ్చిన వెంటనే కంగారు పడ్డానని చెప్పింది.

"""/"/ కాగా కైలీకి, ఆమె ప్రియునికి 2018లో పరిచయమయ్యింది.పెళ్లికి ఒకరోజు ముందు కైలీ, ఆమె స్నేహితులు హాలిడే హోమ్స్‌లో వేడుకలు చేసుకున్నారు.

నాటి అనుభవం గురించి కైలీ మాట్లాడుతూ ‘నేను, నా ప్రియుడు పెళ్లికి ఒక రోజు ముందు మాట్లాడుకోకూడదని నిర్ణయించుకున్నాం.

అటువంటి పరిస్థితిలో, అతనికి ఏమయ్యిందో అస్సలు తెలియలేదు.నా బాయ్ ఫ్రెండ్ స్నేహితునికి ఫోన్ చేస్తే అతను వెళ్లిపోయాడని చెప్పాడు.

కైలీ అత్త కూడా ఇటువంటి సమాధానమే ఇచ్చారని తెలిపింది.దాంతో పెళ్ళితంతులో గందరగోళం సృష్టించడం ఎందుకని మిగతా కార్యక్రమాలను సైలెంట్ గా పూర్తి చేశామని కైలీ చెప్పుకొచ్చింది.

వాళ్లను పక్కనపెట్టకపోతే నష్టపోయేది జగనేగా  ?