దొంగలకి పట్ట పగలే చుక్కలు చూపించిన అమ్మాయి.. వీడియో వైరల్!

దొంగలు ఆడవారిని, ముసలి వారిని ఈజీ టార్గెట్‌గా భావిస్తుంటారు.అందుకే వారిపై ఎక్కువగా దాడులు చేస్తుంటారు.

కాగా ఇటీవల ఇద్దరు దొంగలు పాకిస్థాన్‌లో ఒక అమ్మాయిని దోచుకుందామనుకున్నారు.అయితే ఆ ధైర్యమైన అమ్మాయి ఒక దొంగ చేతిలో నుంచి తుపాకీ లాక్కొని అతడిని నేలపై పడుకుని ప్రాణం బిక్ష పెట్టాలంటూ అడుక్కునేలా చేసింది.

వివరాల్లోకి వెళితే.పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలా సిటీలో బిస్మా షాహిద్ అనే యూనివర్శిటీ విద్యార్థినిపై ఇద్దరు దొంగలు దాడి చేశారు.

ఆమె బ్యాగ్‌తో పాటు ఇతర వస్తువులను లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు.ఈ ఘటన జరిగేటప్పుడు ఆ అమ్మాయి పక్కనే తల్లి కూడా ఉంది.

ఈ క్రమంలో అమ్మాయి ఎదురుదాడి చేసి దొంగలలో ఒకరి నుంచి పిస్టల్‌ను లాక్కుంది.

అప్పటివరకు కన్నెర్ర చేసి బెదిరించిన దొంగలు తుపాకీ అమ్మాయి చేతిలోకి వెళ్ళగానే ఒక్కసారిగా గుండె పగిలారు.

తమకు పిల్లలు ఉన్నారని చెబుతూ క్షమాపణ కోసం వేడుకోవడం ప్రారంభించారు.కానీ ఆ అమ్మాయి వారిని క్షమించే స్థితిలో లేదు.

"ఇప్పుడు మీరు క్షమాపణలు కోరుతున్నారు కానీ నేను క్షమించను! మహిళలు బలహీనంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా?" అని అమ్మాయి వారిని మరింత భయపెట్టింది.

"""/"/ మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడవద్దని దొంగలను హెచ్చరించింది.అలాగే ఒక వీడియో కూడా తీసింది.

ఆ వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్ గా మారింది.నెటిజన్లు ఈ అమ్మాయి గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

చాలామంది ప్రతి ఒక్క అమ్మాయి ఇలాగే ధైర్యంగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు.ఈ వీడియోని మీరు కూడా తిలకించండి.

డబుల్ ధమాకా.. ఒకేరోజు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టార్ హీరోయిన్లు…?