సెలవు దినాలు పని దినాలుగా చేయాలని ముఖ్యమంత్రి కి ఉత్తరం పోస్ట్ చేసిన విద్యా కమిటీ మాజీ చైర్మన్.

రాజన్న సిరిసిల్ల జిల్లా: వరుసగా రాష్ట్రంలో కుండ పోత గా వర్షాలు కురుస్తున్న నేపద్యంలో ప్రభుత్వ పాఠశాలలకు( Government Schools ) సెలవులు ఇవ్వగా సెలవు దినాలను పని దినాలుగా చేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి దోహదపడుతుందనీ ఆ దిశగా ఆలోచన చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) కు ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balaraju Yadav ) లెటర్ రాసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్ట్ చేశారు.

/BR సెలవు దినాలు పని దినాలుగా చేయడం వల్ల పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులు కన్న కలలు సాకారమవుతాయని ఆశిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లెటర్ రాసినట్లు ఒగ్గు బాలరాజు యాదవ్ పేర్కొన్నారు.

ఆడోళ్లు చూడకపోయినా సెన్సేషనల్ హిట్టైన కృష్ణ మూవీ.. ఏదంటే..?