ఓ వైపు ముంచుతున్న వరదలు.. సెల్ఫీలు మోజులో మహిళ*
TeluguStop.com
రోమ్ తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించాడనే సామెత ఉంది.అంటే ఓ వైపు ఎలాంటి దారుణాలు, కొంపలు మునిగే పనులు జరుగుతున్నా కొందరికి మాత్రం అవేమీ పట్టవు.
తమకిష్టమైన పనుల్లో వారు మునిగిపోతుంటారు.తమకు నచ్చినవి చేస్తూ ఉంటారు.
చుట్టూ ఏం జరుగుతున్నా కనీస స్పృహలో ఉండరు.ఇలాంటి వారిని మిగిలిన వారు పిచ్చి పట్టిందేమో అన్నట్లు చూస్తుంటారు.
వారి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది.తాజాగా ఓ మహిళ కూడా ఇదే తరహాలో ప్రవర్తించింది.
ఆమె ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ప్రస్తుతం దేశమంతటా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి.ఎక్కడ చూసినా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి కనిపిస్తున్నాయి.
వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి.ఇక బయటి వద్దామంటేనే చాలా మంది భయపడుతున్నారు.
ఎందుకంటే రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయి కనిపిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఈ తరుణంలో ఓ మహిళ తమ ప్రాంతంలో వరద నీరు నిండిపోయి ఉండగా, సెల్ఫీ తీసుకుంటూ సంతోషంతో మురిసిపోతోంది.
దాదాపు ఆ మహిళ కూడా వరద నీటిలో మునిగిపోయి ఉన్నప్పటికీ ఆమె తన సెల్ఫీ స్టిక్ వదలకుండా సెల్ఫీలు తీసుకుంటూనే ఉంటుంది.
దీనిని ఫైగెన్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఓ వైపు వరదలు ముంచెత్తుతుంటే నీకు ఈ పిచ్చి ఏమిటంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరు ఈ వీడియో పాతదని చెబుతున్నారు.ఏదేమైనా వరదలు ముంచెత్తుతుంటే మహిళ సెల్ఫీలు తీసుకోవడం కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది.
జగన్ మద్దతు ఇవ్వకపోతే… బీజేపీ టార్గెట్ వారే ?