అనారోగ్యంతో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి అండగా జిల్లా పోలీస్ యంత్రాంగం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన అలీ బిన్ సయ్యద్ కుటుంబ సభ్యులకు డబ్బులు అందజేసిన జిల్లా ఎస్పీ( SP Akhil Mahajan ).

రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తు ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిన హోమ్ గార్డ్ ఆలి బిన్ సయ్యద్ కుటుంబానికి జిల్లా పోలీస్ యంత్రాంగం బాసటగా నిలిచి స్వచ్ఛందంగా (1,20,000/- రూపాయలు) జమచేసి వారి కుటుంబా సభ్యులకు ఈ రోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది.

పోలీసుల( Police ) కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్, సి.

ఐ రవీందర్,తదితరులు పాల్గొన్నారు.

ఇదేం విచిత్రం.. 32 పళ్లతో పుట్టిన బిడ్డ.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు??