ఆనందయ్య మందుపై స్పందించిన చినజీయర్ స్వామి..!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య ఇస్తున్న కరోనా మందు బాగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

ఆక్సీజన్ లెవల్స్ పడిపోయిన వారిని కూడా ఆనందయ్య మందు వల్ల తిరిగి ఆక్సీజన్ లెవల్స్ పెంచుకుంటున్నారు.

అయితే ఆనందయ్య మందుపై ప్రజలు భారీ స్పందన తెలియచేయడం ఆ మందు శాస్త్రీయత కోసం ఆనందయ్యని కూడా కనిపించకుండా దాచేస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలాఉంటే ఆనందయ్య మందుపై చినజీయర్ స్వామి స్పందించారు.దుష్ప్రభావాలు లేకుండా.

ఉచితంగా ఇస్తున్న ఈ మందుపై అభ్యంతరాలు ఎందుకని చినజీయర్ స్వామి అన్నారు.ఇలాంటి సంక్షోభం వేళ ఓ మందు ప్రాణాలు నిలబెడుతుంటే వివాదం ఎందుకని అన్నారు చినజీయర్ స్వామి.

ఇలాంటి సంక్షోభం వేళలో వివాదాలకు తావివ్వకూడదని ఆయన అన్నారు.ఓ వ్యక్తి చనిపోతుంటే ఆనందయ్య మందు ప్రాణం పోస్తుంది అలాంటి ఆయన మందుపై ఈ వివాదాలు ఎందుకని అన్నారు చినజీయర్ స్వామి.

అలోపతి వైద్య వ్యవస్థ అంగీకరించిందని.అయితే మంచిని ఎక్కడ నుండైనా తీసుకో వచ్చని ఆయన అన్నారు.

ఎర్రగడ్డలోని ఈ.ఎస్.

ఐ హాస్పిటల్ ను సందర్శించిన చినజీయర్ స్వామి అక్కడ వైద్య సిబ్బందితో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆనందయ్య మందుపై కూడా తన స్పందన తెలియచేశారు. ప్రస్తుతం నెల్లూరులో ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేశారు.

ఆనందయ్య కూడా ఏపీ పోలీసుల సమక్షంలో ఉన్నట్టు తెలుస్తుంది.

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..!