కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ 50 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ 350 రూపాయలు పెంచడానికి సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు సిరిసిల్ల కొత్త బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 450 రూపాయలు ఉన్నటువంటి వంటగ్యాస్ ధర బిజెపి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 1200 రూపాయల పైన పెంచడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వంటగ్యాస్ ధర పెంచితే లబోదిబో మని మొత్తుకున్న మంత్రి శృతి ఇరానీ,నరేంద్ర మోడీ లు గ్యాస్ ధరలు పెంచిన దానికి సమాధానం చెప్పాలని అన్నారు.

అధికారంలో ఉంటే ఒక విధానం అధికారంలో లేకుంటే మరొక విధానం అవలంబించే బిజెపి పార్టీ ప్రజలకు మేలు చేయడం కన్నా కీడు చేయడమే తన విధానమని ప్రజల సంపద మొత్తం బడా పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి ఈ బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

ప్రజలు ఇప్పటికైనా బీజేపీ విధాలపై వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో బిజెపికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కోడం రమణ,అన్నదాస్ గణేష్, గురిజాల శ్రీధర్,ఎలిగేటి రాజశేఖర్, శ్రీరాం రమేష్ చంద్ర, గోవిందు,లక్ష్మణ్, గట్ల సప్న, సామల కవిత,వడ్ల లక్ష్మి ,గడ్డం రాజశేఖర్, బింగి సంపత్, సంధిపట్ల పోచమల్లు, వడ్డేపల్లి గోవర్ధన్, కంది మల్లేశం, వడ్నాల వీరేశం తదితరులు పాల్గొన్నారు.

షాకింగ్ వీడియో: యూఎస్ మహిళను కొరికేసిన సొరచేప.. నీరు ఎర్రగా మారింది..!