వైసీపీలో అందుకే ..మార్పులు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించడం తెలిసిందే."బాదుడే బాదుడు" కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో దాదాపు మూడు రోజుల పాటు పర్యటన కొనసాగింది.

అయితే ఈ పర్యటనలో ప్రజల నుండి మంచి స్పందన రావడంతోనే వైసీపీలో తాజాగా జిల్లా అధ్యక్షులు మరియు రీజినల్ కోఆర్డినేటర్ ల మార్పు జరిగిందని వైసీపీలో.

తన కర్నూలు పర్యటన ప్రకంపనలు సృష్టించిందని చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు.మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆక్వా రైతులతో చంద్రబాబు భేటీ అయిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి స్పందన ఎప్పుడూ చూడలేదని కర్నూలు పర్యటన ఉద్దేశించి తెలియజేశారు.

తన పర్యటనకు ప్రజల నుండి విశేష స్పందన రావడంతో.8 జిల్లాల పార్టీ అధ్యక్షులను మార్చేశారని పేర్కొన్నారు.

ఇక ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో 175 స్థానాలలో వైసిపి ఓడిపోతుందని.చంద్రబాబు జోష్యం చెప్పారు.

ఇంకా ఆక్వా రైతులకు పలు హామీలు ఇచ్చారు.ఆక్వా రంగానికి పునర్ వైభవం వచ్చేలా.

కృషి చేస్తామని స్పష్టం చేశారు.ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.

1.50కే ఇస్తామని హామీ ఇచ్చారు.

ఏపీలో అవినీతి లేని ప్రభుత్వం కూటమితోనే సాధ్యం..: రాజ్‎నాథ్ సింగ్