అందుకే చంద్రబాబు తన చేతికి ‘స్మార్ట్’ రింగ్ పెట్టుకున్నారా?

సాధారణంగా రాజకీయ నేతలు ఏం చేసినా దాని గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతుంటుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు చేతి రింగ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా.అందరి చూపు ఆయన ఎడమ చేతి చూపుడు వేలికి ఉన్న ఉంగరంపైనే పడుతోంది.

ఆ ఉంగరం ఏంటి.? ఎవరైనా పండితులు చెప్పారా.

? జాతకం బాగుండాలని పెట్టుకున్నారా.? లేదా ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

జులై 1 నుంచి చంద్రబాబు ఎడమ చేతికి ఈ రింగ్‌ పెట్టుకున్నారు.ఆరోజు పెట్టిన ప్రెస్‌మీట్‌తో పాటు గురువారం మదనపల్లిలో జరిగిన మహానాడు సభలో చంద్రబాబు చేతికి రింగ్‌ కనిపించింది.

దీంతో వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసమే చంద్రబాబు రింగ్ పెట్టుకున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో తన వేలికి ఉన్న రింగ్ గురించి ఓ విషయాన్ని చంద్రబాబు స్వయంగా కార్యకర్తలకు చెప్పారు.

ఇది మాములు రింగ్ కాదని స్మార్ట్ రింగ్ అని వివరించారు.తాను ధరించిన ఈ రింగ్‌లో చిప్ ఉంటుందని.

అది తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు వైద్యులకు తెలియచేస్తుందని చెప్పారు.టీడీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

అయితే చంద్రబాబు నిజమే చెబుతున్నారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎప్పుడూ బంగారు, వెండి ఆభరణాలు ధరించేవాళ్లు కాదు.

ఆయన చేతికి రింగులు, మెడలో గొలుసులు ఏనాడు కనిపించలేదు.సాదాసీదాగా జీవించడానికే చంద్రబాబు ఇష్టపడుతుంటారు.

"""/"/ నిత్యం జేబులో పెన్నుతో మాత్రమే చంద్రబాబు కనిపించేవారు.చేతికి వాచీ కూడా పెట్టుకునేవారు కాదు.

కానీ ఎడమ చేతి చూపుడు వేలుకు ఇప్పుడు రింగ్‌ పెట్టుకుంటున్నారు.ఈ సడెన్‌ ఛేంజ్‌ వెనుక రీజనేంటి? బాబు కూడా సెంటిమెంట్‌లను నమ్ముకుంటున్నారా అంటూ చర్చ జరుగుతూనే ఉంది.

హెల్త్ చెకప్ కోసమే తాను రింగ్ ధరించానని చంద్రబాబు చెప్పినా ఆయన వ్యతిరేకులు మాత్రం దీని వెనుక చిదంబర రహస్యం ఉందంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతూనే ఉన్నారు.

అనారోగ్యానికి గురైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… ఏమైందంటే?