అతితక్కువ సమయంలో రష్మిక ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఆ పూజలా.. వేణుస్వామి కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మొదటి సినిమాతోనే ఇంత మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది.

ఇక ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుసగా అవకాశాలు వస్తున్నాయి.కేవలం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

అయితే రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలాంటి అద్భుతమైన సక్సెస్ అందుకోవడానికి గల కారణం ఏమిటి అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలను అందుకుని స్టార్ గుర్తింపు సంపాదించుకోవడానికి హీరో హీరోయిన్లు లేదా యాంకర్లు పూజలు చేయిస్తారని అలాంటి పూజలు చేసి చాలామంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అనే వార్త ఎప్పటినుంచో వినపడుతోంది.

అలాంటి పూజలే రష్మిక కూడా చేయించిందని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తన మాటలలో వెల్లడించారు.

"""/" / సాధారణంగా అమ్మాయిలు వారు చేసే పనిలో విజయం సాధించాలంటే వారు తార అనే పూజ చేయిస్తే వారికి మంచి విజయం కలుగుతుందని అలాంటివారు తొందరగా విజయపథంలో దూసుకుపోతారని ఆయన వెల్లడించారు.

ఈ క్రమంలోనే వేణుస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరి రష్మిక సక్సెస్ వెనుక కారణం పూజలేనా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఏదిఏమైనా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలాంటి విజయాలను తన ఖాతాలో వేసుకోవడం చూస్తుంటే సోషల్ మీడియాలో ఈమె గురించి వస్తున్న వార్తలలో నిజం ఉండవచ్చనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

"""/" / సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పుష్ప అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మరోసారి విజయవంతమైన సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.

ఇలా పుష్ప సినిమా విజయవంతం కావడంతో H3 Class=subheader-styleరష్మిక /h3pగురించి ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

అలాగే తెలుగులో శర్వానంద్ సరసన ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో నటిస్తున్నారు.

నా 24 సంవత్సరాల కల నెరవేరింది.. కాంతార హీరో రిషబ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!