ఆ సినిమా రీమేక్ చేయాలని ఉంది.. మనసులో కోరికను బయటపెట్టిన హీరో ఆది?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న ఆది సాయికుమార్ ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో అనే సినిమాలతోప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది తాజాగా టాప్ గేర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

కె.శశికాంత్ దర్శకత్వంలో K.

V.శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. """/"/ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది సాయికుమార్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సినిమాలో తాను ఒక క్యాబ్ డ్రైవర్ గా కనిపించబోతున్నానని తెలిపారు.ఇందులో తాను తనది కాని సమస్యలలో చిక్కుకొని ఆ సమస్యల నుంచి ఎలా బయట పడతాననేదే ఈ చిత్రం.

అయితే ఈ సినిమాలో కథ మొత్తం ఒకేరోజులోనే జరుగుతుందని ఈ సినిమా గురించి ఆది పలు విషయాలను తెలిపారు.

"""/"/ ఇక ఈ సినిమాలో ఆది సరసన రియా సుమన్‌ హీరోయిన్ పాత్రలో నటించారు.

ఈ టాప్ గేర్ సినిమా టెక్నికల్ గా చాలా అద్భుతంగా ఉంటుందని ఈ సందర్భంగా సాయికుమార్ తెలిపారు.

ఇకపోతే తన తండ్రి సాయికుమార్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.ఆయన సినిమాలలో కనుక రీమేక్ చేయాల్సి వస్తే ఏ సినిమా చేస్తారు అలాగే ఏ సినిమాలోని పాటలను రీమేక్ చేస్తారనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ ఒకవేళ అలా రీమేక్ చేయాల్సి వస్తే అంతఃపురం సినిమాను చేస్తానని,ఇక ఇందులో అసలేం గుర్తుకురాదు అనే పాటను రీమేక్ చేయాలని ఉంది అంటూ మనసులో కోరికను బయట పెట్టారు.

ఈ సందర్భంగా ఆది సాయికుమార్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలుగు లో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఇద్దరు దర్శకులు వీళ్లేనా..?