సర్కారు బిజిఎం కూడా నెక్స్ట్ లెవల్ అంట.. థమన్ భరోసా!
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న విషయం విదితమే.
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా నుండి ఇటీవలే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యి చార్ బస్టర్ గా నిలిచింది.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ పాట కోసం అభిమానులంతా ఎదురు చూసారు.
ఈయన సంగీతం అందిస్తున్నాడు అంటే సూపర్ హిట్ అవుతుంది అని పేరు తెచ్చుకున్నాడు.
థమన్ పాటలు మాత్రమే కాదు ఆయన సినిమాలకు అందించే బిజిఎం కూడా ఆ సినిమాలను నెక్స్ట్ లెవల్ కు చేరుస్తున్నాయి.
ఇటీవలే ఈయన చేసిన అఖండ సినిమా బిజిఎం ప్రేక్షకులను కట్టిపడేసింది.ఈ సినిమా హిట్ అవ్వడంతో థమన్ అందించిన సంగీతం, బిజిఎం కీలక పాత్ర పోషించింది.
ఇక ఇప్పుడు తమన్ చేస్తున్న సినిమాల్లో సర్కారు వారి పాట ఒకటి.ఈ సినిమా పై క్రేజ్ భారీగా ఉంది.
ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి.అందులో రెండు పాటలు కూడా మంచి టాక్ అందుకున్నాయి.
కళావతి తో పాటు, పెన్నీ సాంగ్స్ కూడా అభిమానులను అలరిస్తుంది.ఇక ఈ సినిమా బిజిఎం ఓ రేంజ్ లో ఉంటుందని థమన్ ప్రేక్షకులకు హామీ ఇస్తున్నారు.
"""/"/
ఈ సినిమాలో బిజిఎం సిల్వర్ స్క్రీన్ పై దుమ్ము రేపనుందని థమన్ చెబుతున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ లోనే బిజిఎం ఉండబోతుందని.అందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.
మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు.
జబర్దస్త్ కి మరో కొత్త జడ్జ్… బుల్లితెరపై సందడి చేస్తున్న అందమైన జోడి!