పొలిటిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన త‌లైవా..!

ద‌క్షిణాది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.చెన్నైలో ర‌జ‌నీ త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వితో స‌మావేశం అయ్యారు.

అనంత‌రం మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానమిస్తూ మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌న లేద‌ని తేల్చి చెప్పేశారు.

గ‌తంలో త‌లైవా రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఉద్దేశంతో ర‌జ‌నీ మ‌క్క‌ల్ మండ్రం అనే సంస్థ‌ను స్థాపించారు.

ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీ కోసం దేశం అంతా ఆస‌క్తిగా ఎదురు చూసిన విష‌యం తెలిసిందే.

అయితే ర‌జ‌నీ ఆరోగ్య ప‌రిస్థితి ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీకి బ్రేక్ వేసింది.గ‌త కొంత‌కాలంగా త‌ర‌చూ అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుండ‌టంతో తాను రాజకీయాల్లోకి రాన‌ని ర‌జ‌నీకాంత్ వెల్ల‌డించారు.

అంతేకాకుండా ర‌జ‌నీ మ‌క్క‌ల్ మండ్రం సంస్థ‌ను ర‌ద్దు చేసి, అభిమానుల సంక్షేమ సంఘంగా మార్చేందుకు నిర్ణ‌యించారు.

ప్రేమించుకుందాంరా సినిమాలో జయప్రకాష్ రెడ్డి రోల్ మిస్సైన నటుడు అతనే.. ఏమైందంటే?