రేపు టెట్‌ ఫలితాలు… విద్యాశాఖ‌ ప్ర‌క‌టన

హైదరాబాద్‌/నల్లగొండ జిల్లా:టెట్‌,టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ ( TET )ఫలితాలు రేపు విడుదలకానున్నాయి.విద్యాశాఖ ముందసుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 27న ఫలితాలను వెల్లడించనున్నారు.

ఈనెల 15న టెట్‌ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ నిర్వహించిన సంగతి తెలిసిందే.పేపర్‌-1కు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 2,26,744 (84.

12 శాతం) మంది పరీక్షను రాశారు.పేపర్‌-2 పరీక్షను 2,08,498 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1,89,963 (91.

11 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు) పేపర్‌-2తో పోల్చుకుంటే పేపర్‌-1 ప్రశ్నపత్రం సులువుగా వస్తే,పేపర్‌-2 కాస్తా టఫ్‌గా( Paper-2 ) వచ్చింది.

ఈ క్రమంలోనే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది.

వైరల్ వీడియో: ఇంకా మారారా.. ట్రైన్ ముందు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చిన మహిళ.. చివరకి..