ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్ష
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాలలో టెట్ పరీక్షలను పకడ్బందీగా చేపట్టామని జిల్లా కలెక్టర్ టి.
వినయ్ కృష్ణారెడ్డి అన్నారు.ఆదివారం నిర్వహించిన టెట్ పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టరు ఉదయం పట్టణంలోని 60 ఫీట్స్ రోడ్డులో గల కాకతీయ కాన్సెప్ట్ హై స్కూల్,జెడ్.
పి హై స్కూల్ లో ఏర్పాటు చేసిన కేంద్రాలను అలాగే పోలీస్ స్టేషన్ నుండి కేంద్రాలకు పంపే ప్రశ్న పత్రాల తీరును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్ష కేంద్రంలోని అన్ని ఎక్జాం హాల్ కి వెళ్లి పరిశీలించారు.
సెంటర్ లోని ఏర్పాట్లను ఇతర సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.జిల్లాలో ఉదయం 58 సెంటర్లలో టెట్ I పేపర్ పరీక్షకు 13 727 మంది అభ్యర్థులకు 11701 మంది హాజరు కాగా 2026 మంది గైరాజరు అలాగే టెట్ II పరీక్ష పేపర్ 12010 మంది అభ్యర్థులకి 10462 మంది హాజరు కాగా 1548 గైర్హాజరు అయ్యారని తెలిపారు.
ఎక్కడకూడా ఎలాంటి సంఘటనలు జరగలేదని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.
ఓ అశోక్, పోలీస్,విద్యా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టార్గెట్ జగన్… పులివెందుల నుంచే మొదలుపెట్టిన బాబు