కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత

కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుంది.

ఈ క్రమంలో బారికేడ్లను తోసుకొని కలెక్టరేట్ లోకి చొచ్చుకుని వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు.

రైతులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి టెన్షన్ వాతావరణం ఏర్పడింది.అయితే, మాస్టర్ ప్లాన్ లోని ఇండస్ట్రీయల్, గ్రీన్, బఫర్ జోన్లతో పాటు వందపీట్ల రోడ్లు బాధిత గ్రామాల రైతుల భూముల్లోంచి పొందుపరిచారు.

దీంతో తమ భూముల విలువలు తగ్గిపోతాయని ఆరోపిస్తూ రైతులు తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

పుచ్చ గింజలతో ఈ ఫేస్ మాస్క్ వేసుకుంటే మొటిమలు మచ్చలు మాయం అవ్వడం ఖాయం!