వికారాబాద్ జిల్లా దుద్యాల‌లో ఉద్రిక్త‌త‌

వికారాబాద్ జిల్లా దుద్యాల గ్రామంలో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర కొన‌సాగుతుంది.

ఈ క్ర‌మంలో ష‌ర్మిల‌ను టీఆర్ఎస్ నేత‌లు అడ్డుకున్నారు.కొడంగ‌ల్ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు.

అనంత‌రం ప్లకార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ నిర‌స‌న‌కు దిగారు.దీంతో ఉద్రిక్త వాతావర‌ణం నెల‌కొంది.

పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ప‌రిస్థితిని అదుపులోకి తీసుకువ‌చ్చారు.

ఆ రీజన్ వల్లే నాకు సౌత్ లో ఆఫర్లు తగ్గాయి.. ఇలియానా షాకింగ్ కామెంట్స్ వైరల్!