నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో ఉద్రిక్తత
TeluguStop.com
నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వర్సిటీలోని వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
పీడీఎస్యూ, ఎన్ఐఎస్యూ విద్యార్థి సంఘాల నేతలు అక్కడ బైఠాయించి నిరసనకు దిగారు.వీసీ వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారని తెలుస్తోంది.అయితే వర్సిటీలో గత కొన్ని రోజులగా రిజిస్ట్రార్ విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
రిజిస్ట్రార్ నేనంటే నేనంటూ ప్రొఫెసర్ యాదగిరి, కనకయ్యల మధ్య రగడ చెలరేగింది.అయితే ప్రొ.
యాదగిరిని రిజిస్ట్రార్ గా, కనకయ్యను వీసీగా పాలకమండలి నియమించింది.దీంతో వర్సిటీ రెండు వర్గాలుగా విడిపోవడంతో వివాదం కొనసాగుతుంది.
వారానికి ఒక్కసారి ఈ హెయిర్ టానిక్ ను వాడితే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది!