హైదరాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో ఉద్రిక్తత

హైదరాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది.హైదరాబాద్ లోని గాంధీభవన్ లో( Gandhi Bhavan ) నేతల మధ్య సమన్వయం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించారని తెలుస్తోంది.

ఈ మేరకు ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీ( AICC Secretary Mansoor Ali ) ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

సమావేశానికి ఇతర నేతలు రావడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే నేతల మధ్య చెలరేగిన వివాదం ముదరడంతో తోపులాటకు దారి తీసింది.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన మన్సూర్ అలీ గాంధీభవన్ నుంచి వెళ్లిపోయారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే27, సోమవారం 2024