ఏలూరు జిల్లా దెందులూరులో ఉద్రిక్తత

ఏలూరు జిల్లా దెందులూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.నియోజకవర్గంలో టీడీపీ( TDP ) నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఘర్షణ వాతావరణం చెలరేగింది.

తనకు ఓటు వెయ్యనన్నందుకు దళితుడిపై టీడీపీ నేత చింతమనేని( Chintamaneni Prabhakar ) దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా ఇటీవల వైసీపీలో చేరిన వారిపై కూడా దాడి చేశారంటూ చింతమనేనిపై పలువురు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

ఈ దాడిలో గాయపడిన వారిని వైసీపీ నేతలు చికిత్స నిమిత్తం ఏలూరు ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న అబ్బయ్య చౌదరి, కారుమూరి సునీల్ గాయపడిన వైసీపీ కార్యకర్తలను పరామర్శించారు.

ప్లాన్ ప్రకారమే తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని అబ్బయ్య చౌదరి తీవ్రంగా మండిపడ్డారు.

ఈ క్రమంలోనే చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

సర్క్యులర్ తప్పైతే జైలుకు వెళ్తా.. మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్