విశాఖ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత..!

విశాఖ నగరంలోని( Visakhapatnam ) గంగవరం పోర్టు( Gangavaram Port ) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

తమకు న్యాయం చేయాలంటూ కాంట్రాక్టు కార్మికులు( Contract Workers ) నిరసనకు దిగారు.

ఈ క్రమంలోనే జీతాలు పెంచాలని, కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పోర్టు వద్ద కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేయరాదని కార్మికులకు పోలీసులు సూచించారు.

ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య చెలరేగిన వాగ్వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఉద్రిక్తత నెలకొంది.

జూలైలో పెరిగిన ఎన్ఆర్ఐల డిపాజిట్స్.. ఎన్ని మిలియన్ డాలర్లంటే!!