Madhusudan Reddy : సంగారెడ్డి జిల్లా పటాన్‎చెరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్

సంగారెడ్డి జిల్లా పటాన్‎చెరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ( MLA Goodem Mahipal Reddy )సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని ( Madhusudan Reddy )పోలీసులు అరెస్ట్ చేశారు.

పటాన్ చెరు మండలంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని పలు ఆరోపణలు వస్తున్నాయి.

నాలుగు ఎకరాల్లో నిర్వహించాల్సిన మైనింగ్ సుమారు 15 ఎకరాల వరకు అధికారులు జరుగుతున్నట్లు గుర్తించారు.

ఈ క్రమంలో అధికారుల ఫిర్యాదు మేరకు క్రషర్ నిర్వహిస్తున్న మధుసూదన్ రెడ్డిని పోలీసులు ఈ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం ఆయనను పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారన్న సమాచారంతో బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు.

తరువాత మధుసూదన్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు తీసుకువెళ్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే పోలీస్ వాహనంపై దాడికి పాల్పడ్డారు.దీంతో పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జోర్దార్ సుజాత..ఇంత సీక్రెట్ గా ఉంచారే?