కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కొత్త మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ విలీన గ్రామాల ప్రజలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

రైతుల భూములున్న ప్రాంతాన్ని ఇండస్ట్రీయల్ జోన్ గా ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనంతరం మున్సిపాలిటీలోకి చొచ్చుకెళ్లిన రైతులు మున్సిపల్ కమిషనర్ తో వాగ్వివాదానికి దిగారు.మరోవైపు రైతుల నిరసనకు బీజేపీ మద్ధతు తెలిపింది.

ఈ నేపథ్యంలో కొత్త మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

Chandra Babu : వైసీపీని ఓడించి ఏపీని కాపాడుకోవాలి..: చంద్రబాబు