హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఇందిరాపార్క్ వద్ద యాదవ జేఏసీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమను కించపరిచారని యాదవ జేఏసీ ఆరోపిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

ఈ నేపథ్యంలో గొల్ల, కురుములను కించపరుస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇందిరాపార్క్ వద్ద భారీగా మోహరించారు.

కేసీఆర్ ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు..: మంత్రి పొన్నం