ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు విచారణ వాయిదా

ఫామ్ హౌస్ డీల్ కేసు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.ఈ మేరకు హైకోర్టులో నమోదైన అన్ని పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.

ప్రభుత్వం తరపున దుశ్యంత్ దవే వాదనలు వినిపించగా బీజేపీ తరపున ప్రభాకర్ రావు తమ వాదనలను వినిపించారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై స్పందించే హక్కు సీఎం కేసీఆర్ కు ఉందని దవే కోర్టుకు తెలిపారు.

సిట్ చీఫ్ సీవీ ఆనంద్ దేశంలో ఎక్కడికైనా వెళ్లి పనిచేస్తారన్నారు.ఎమ్మెల్యేల కొనుగోల తీవ్ర నేరమైన కేసన్న దవే బీజేపీకి సంబంధం లేదంటే విచారణకు సహకరించాలని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేసింది.

ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!