ప్రజా పాలనకు తాత్కాలిక బ్రేక్…!

నల్లగొండ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రేపు,ఎల్లుండి రెండు రోజులు తాత్కాలిక బ్రేక్ పడింది.

రేపు డిసెంబర్ 31 ఆదివారం, ఎల్లుండి జనవరి 1 కొత్త సంవత్సరం కావడంతో ప్రభుత్వం అధికారిక సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ రెండు రోజుల సెలవు దినాలు దరఖాస్తులు బంద్ చేసి తిరిగి 2024 జనవరి 2 నుండి 6 వరకు యధాతధంగా కొనసాగనున్నాయి.

న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌ : ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య రామమందిర నమూనా ..!!