తెలుగులో తళుక్కున మెరిసి తెరమరుగైన ఈ హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన "వేదం" అనే  చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ దీక్షా సేథ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

  అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే మంచి ఫేమస్ డైరెక్టర్ మరియు స్టార్ హీరో స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చినటువంటి చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈ అమ్మడుకి గుర్తింపు రాలేదు.

కానీ సినీ అవకాశాలు మాత్రం బాగానే తలుపు తట్టాయి.ఈ క్రమంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించినటువంటి మిరపకాయ్ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

అయితే ఈ చిత్రం హిట్ అయినప్పటికీ ఈ అమ్మడుకి మాత్రం కలిసి రాలేదు.

ఆ తర్వాత తెలుగులో టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించినటువంటి వాంటెడ్ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ చిత్రం పర్వాలేదనిపించడంతో తెలుగులో కాకుండా తమిళం లో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంది.

అయితే అక్కడ కొంత కాలం పాటు హీరోయిన్ గా బాగానే రాణించినప్పటికీ ఈ అమ్మడు నటించిన ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి.

దీంతో ప్రస్తుతం అక్కడ కూడా సినీ అవకాశాలు లేక తన ఉనికిని చాటుకునేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

అయితే ఏమైందో ఏమో కానీ ఈ మధ్య దీక్ష సేథ్ సినీ ఫంక్షన్స్ లోగాని లేదా మరే ఇతర కార్యాల్లో కూడా అస్సలు కనిపించడం లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి దీక్షా సేథ్ హీరోయిన్ గానే కాకుండా పలు చిత్రాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించింది.

రంగంలోకి నందమూరి బ్రదర్ .. నేటి  నుంచే ఎన్నికల ప్రచారం