నాకు కోపం ఎక్కువంటున్న పవన్ మాజీ భార్య…. దాంతో అకీరా కూడా…

తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "బద్రి" అనే చిత్రంలో హీరోయిన్ గా  నటించి ఈ చిత్రంలో హీరోగా నటించిన "పవర్ స్టార్ పవన్ కళ్యాణ్" తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న స్టార్ వెటరన్ హీరోయిన్ "రేణు దేశాయ్" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే పెళ్లయిన తర్వాత "రేణు దేశాయ్" పూర్తిగా సినిమా పరిశ్రమకు దూరం అయిపోయింది.

కాగా ఈ మధ్య కాలంలో రేణు దేశాయ్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.

ఈ క్రమంలో తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించి కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు  ఇచ్చింది.

 ఇందులో భాగంగా తనకి కోపం కొంచెం ఎక్కువని చాలా సార్లు "అకీరా నందన్" తన కోపాన్ని దగ్గర నుంచి చూశాడని, దాంతో అప్పుడప్పుడు కోపం తనకి తగ్గించుకోవాలని చెబుతుంటాడని చెప్పుకొచ్చింది.

అంతేగాక ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో పాఠశాలలు మూత పడిన కారణంగా అఖిరా నందన్, ఆద్య ఆన్ లైన్ క్లాసులు వింటున్నారని తెలిపింది.

అయితే అకీరా నందన్ సినిమా పరిశ్రమ ఎంట్రీ విషయంపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

"""/"/ అయితే ఈ విషయం ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ విడిపోయినప్పటి నుంచి తన పిల్లలతో కలిసి పూణే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఉంటోంది.

కాగా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు  పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న "సర్కారు వారి పాట" అనే చిత్రంలో నటిస్తోంది.

 ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వదిన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

నా సినిమాకే పోటీనా అంటూ ఆ డైరెక్టర్ కు చరణ్ వార్నింగ్.. చివరికి ఏమైందంటే?