సోషల్ మీడియాలో బాగానే అలరిస్తున్న ఒకప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్...

ఒకప్పుడు తెలుగులో పలు చిత్రాలలో హీరోయిన్ స్నేహితురాలు, అలాగే హీరో చెల్లెలు తదితర పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ "వర్ష" గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే వర్ష ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి "వాసు" చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది.

అలాగే మరో స్టార్ హీరో అయినా "రాజశేఖర్" తో కలిసి సింహ రాశి చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించి పలు ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ సన్నివేశాలలో నటించి బాగానే ఆకట్టుకుంది.

అయితే తెలుగులో వందకు పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించిన వర్ష పెళ్లయిన తర్వాత కొంతకాలంపాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది.

అయితే ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన వర్ష ప్రస్తుతం పలు ధారావాహికలలో నటిస్తూ బాగానే రాణిస్తోంది.

కాగా ఇటీవలే వర్ష సోషల్ మీడియా మాధ్యమాలలో అడుగు పెట్టింది.దీంతో ఈ మధ్య బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

అంతేకాకుండా అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ బాగానే అలరిస్తోంది.

కాగా ఈ మధ్య వర్ష షూటింగ్ బ్రేక్ సమయంలో పలువురు నటీనటులతో రీల్స్ చేస్తూ ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.

దీంతో ప్రస్తుతం వర్ష కి రోజురోజుకీ ఫాలోవర్లు సంఖ్య బాగానే పెరుగుతోంది.కాగా ప్రస్తుతం వర్ష ఇంస్టాగ్రామ్ ఖాతాని దాదాపుగా 8 వేల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

"""/"/ ఈ విషయం ఇలా ఉండగా వర్ష ప్రస్తుతం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన మా టీవీలో ప్రసారమయ్యే "కస్తూరి" ధారావాహికలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు నటిస్తోంది.

అంతేకాకుండా అప్పుడప్పుడు పలు టాలీవుడ్ చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తోంది.

అయితే దాదాపుగా 5 సంవత్సరాల పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్న వర్ష అజయ్ సెకండ్ ఇన్నింగ్స్ లో బాగానే ఆకట్టుకుంటూ అవకాశాలను దక్కించుకుంటోంది.

ఏపీ ఎన్నికల పోలింగ్ శాతంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!