ఈ సీరియల్ నటి తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది… కానీ…

మొదటగా హీరోయిన్ కావాలని సినిమా పరిశ్రమకు వచ్చిన పలు కారణాల వల్ల హీరోయిన్ కాలేకపోయిన నటీమణులు ఎందరో ఉన్నారు.

అలాగే ఇంకొంతముందైతే  పలు చిత్రాల్లో సినిమా హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఆ చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అవ్వడంతో చివరికి హీరోయిన్ అవకాశాలు లేక సీరియళ్లలో కూడా నటిస్తూ సర్దుకుపోతున్న నటీమణులు కూడా ఉన్నారు.

 అయితే ఇలాంటి నటీమణుల్లో తెలుగు ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక నాయుడు ఒకరు.

అయితే మొదటగా ప్రియాంక నాయుడు ఓ ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ లో ప్రసారమయ్యే తెలుగు సీరియల్ ద్వారా నటిగా బుల్లి తెరకి పరిచయం అయింది.

 ఆ తర్వాత "టూలెట్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

 అయితే ఈ చిత్రం చిన్న తరహా బడ్జెట్ చిత్రం కావడంతో అసలు విడుదలైనట్లు కూడా ఎవరికీ తెలియలేదు.

ఆ తరువాత "అనగనగా ఒక దుర్గ" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి నటిగా సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ ఎందుకో కొత్త సినిమా అవకాశాలను మాత్రం దక్కించుకోలేక పోయింది.

దీంతో ఇక చేసేదేమి లేక మళ్లీ సీరియళ్లపై దృష్టి సారించింది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి బుల్లితెర లైఫ్ బాగానే సాగిపోతోంది.

"""/"/ ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య నటి ప్రియాంక నాయుడు పలు తెలుగు సీరియళ్లలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించిన తెలుగు ప్రముఖ సీరియల్ నటుడు మధు బాబుని పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

 అంతేగాక ఇటీవలే వీరిద్దరూ కలిసి ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

అయితే మధు బాబు కూడా ప్రస్తుతం బుల్లితెర పై బాగా నే రాణిస్తున్నాడు.

కాగా దాదాపుగా పది సంవత్సరాల పాటు ప్రియాంక నాయుడు మరియు మధు బాబు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.

ఇటీవలే వీరిద్దరి కుటుంభ సభ్యులు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తొందర్లోనే పెళ్లి పీటలెక్కనున్నారు.

వలసదారుల సంక్షోభం .. ఫ్లైటెక్కిన తొలి శరణార్ధి, బ్రిటన్‌ రువాండా ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా .. ?