హీరోయిన్ సిమ్రన్ చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది.. దాంతో ఆ తెలుగు హీరో...
TeluguStop.com
తెలుగులో సార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, తదితర స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన టాలీవుడ్ ప్రముఖ నటి సిమ్రాన్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే తెలుగులో నటి సిమ్రాన్ హీరోయిన్ గా నటించిన దాదాపుగా అన్ని టాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.
దీంతో నటి సిమ్రన్ కి తెలుగులో మంచి సక్సెస్ రేట్ ఉందని చెప్పవచ్చు.
కాగా నటి సిమ్రాన్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీ, మలయాళం, తదితర భాషలలో కూడా నటించింది.
దీంతో దాదాపు 200 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించి సౌత్ ఇండియాలో తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది సిమ్రన్.
ఈ అయితే ఇప్పటికీ సిమ్రన్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సిమ్రాన్ చెల్లెలు కూడా హీరోయిన్ అని.
అయితే ఆమె ఎవరో కాదు నటి మోనాల్ నావల్.నటి మోనాల్ సిమ్రాన్ అంత కాకపోయినా పలు హిందీ మరియు ఒకటి, రెండు తెలుగు చిత్రాలలో కనిపించి అలరించింది.
అంతేగాక పలు వాణిజ్య సంస్థల ప్రకటనలలో కూడా నటించింది.అయినప్పటికీ మోనాల్ నావల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
కాగా మొదటిగా మోనాల్ తమిళంలో మంచి విజయం సాధించిన "బద్రి" చిత్రంలో విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది.
ఈ చిత్రం మంచి హిట్ అవడంతో వరుస సినిమా ఆఫర్లను కూడా తెచ్చిపెట్టింది.
కానీ కథల విషయంలో మోనాల్ సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో దారుణమైన ఫ్లాప్ లను మూట గట్టుకుంది.
దీంతో మోనాల్ కి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అనుకోకుండా ఆత్మహత్య చేసుకుంది.
దీంతో ఒక్కసారిగా సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయింది.అయితే ఉన్నట్లుండి నటి మోనాల్ ఆత్మహత్య చేసుకోవడంతో అప్పటికే ఆమె హీరోయిన్ గా నటిస్తున్న "దాదాగిరి" అనే చిత్రం పూర్తిగా ఆగిపోయింది.
కానీ కానీ మోనాల్ ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న విషయంపై ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి సిమ్రన్ తెలుగులో ఎక్కువగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
కాగా ప్రస్తుతం సిమ్రన్ హిందీలో "రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్" అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.
ఎవరు ఈ ఇందు రెబెకా వర్గీస్..? సాయి పల్లవి ఒప్పుకుందంటే విషయం ఉండే ఉంటుంది !