ఆ విషయంలో బ్రహ్మానందంతో గొడవ పడిన మాట వాస్తవమే…. కానీ

తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సీనియర్ హీరో మరియు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీరాజా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.

  శివాజీరాజా మొదట్లో పలు చిత్రాలలో హీరోగా కూడా నటించి ప్రేక్షకుల్ని బాగానే అలరించాడు.

 అయితేతాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని అప్పట్లో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందంతో జరిగినటువంటి గొడవ గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో ముఖ్యంగా అప్పట్లో సినీ పరిశ్రమలోని తన స్నేహితులు కొంతమందితో కలిసి హాస్య నటుడు బ్రహ్మానందం పేరు మీద ఓ  ట్రస్ట్ నెలకొల్పామని అయితే ఆ ట్రస్టులోని డబ్బు కొంతమేర దుర్వినియోగం అయిందని ఆరోపణలు రావడంతో ఆ విషయం గురించి బ్రహ్మానందం గారితో చర్చించానని ఆ తర్వాత ఈ విషయం కాస్త టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరియు తెలుగు దేశం పార్టీ మాజీ  ఎమ్మెల్యే పరిటాల రవి తదితరుల దగ్గరికి కూడా వెళ్లిందని తెలిపాడు.

 దాంతో వారు తనని పిలిపించి ఈ విషయం గురించి మాట్లాడగా మొత్తం విషయం సర్ధుమణిగిందని దాంతో కొందరు తనకి బ్రహ్మానందానికి మధ్య గొడవలు జరిగినట్లు ఇప్పటికీ వారు ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లు కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేశాడు.

అయితే ఈ విషయం వల్ల మొదటిసారిగా  పరిటాల రవి ని చాలా దగ్గరి నుంచి చూశానని దాంతో తనకు ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించిందని చెప్పుకొచ్చాడు.

ఈ విషయాన్ని ఇలా ఉండగా తెలుగులో శివాజీ రాజా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, గా సినిమాల్లో నటించడమే కాకుండా పలు చిత్రాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

కాగా ప్రస్తుతం పలు టాలీవుడ్ చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.ఇటీవలె శివాజీ రాజా తన కొడుకు విజయ్ ని కూడా హీరో గా సినీ పరిశ్రమకి పరిచయం చేస్తున్నట్లు తెలిపాడు.

పులికి వణుకు పుట్టించిన ఎలుగుబంటి.. వీడియో వైరల్‌..