ఆ వీక్నెస్ ని తెలుగు తమ్ముళ్లు మార్చుకోవాల్సిందే..!!
TeluguStop.com

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో సీనియర్లు.కీలక నేతలూ ఉన్నారు.


బలమైన అభ్యర్థులూ ఉన్నారు.అయితే వారు చంద్రబాబు పిలుపునిస్తే మాత్రం బయటకు రావడం లేదట.


ప్రజల్లోకి వెళ్లాని సూచించినా.ఎదైనా కార్యక్రమం చేపట్టమని చెప్పానా పూర్తి స్థాయిలో నేతలు కదలిరావడం లేదని అంటున్నారు.
చంద్రబాబు పదే పదే చెబుతున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు.ఏదో కొద్ది మంది మాత్రమే ప్రజలకు చేరువగా ఉంటున్నారట.
దీంతో విసిగిపోయిన చంద్రబాబు ఇప్పటికే పార్టీ కోసం పనిచేయనివారికి.అలాగే మూడేళ్లు పార్టీకి దూరంగా ఉన్నవాళ్లకు టికెట్ల టికెట్ల భయం పెట్టారు.
H3 Class=subheader-styleఏదైనా జరిగితేనే వస్తారా.?/h3p
అయినా కూడా కొంతమంది నేతల్లో ఎలాంటి మార్పు లేదట.
మరి మాకు తప్ప ఇంకెవరికి టికెట్లు ఇస్తారనే ధీమానో.ఏంటో తెలియదు కానీ అనుకున్న విధంగా నేతలు బయటకు రావడం లేదు.
దీంతో చంద్రబాబు తానే స్వయంగా ప్రజల్లోకి వస్తున్నారు.పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నారు.అయితే ఇలాంటి సమయాల్లో ఏదైనా అలజడి జరిగితే టీడీపీ సైన్యం ఒక్కసారిగా స్పందిస్తోంది.
చంద్రబాబు కు మద్దతుగా రోడ్డెక్కుతోంది.ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోంది.
మరి ఇప్పటి వరకు ఈ సైన్యం ఏం చేస్తున్నట్టు.? అనేదే అసలు ప్రశ్న.
తాజాగా కుప్పంలో చంద్రబాబుపై జరిగిన దాడులు.పార్టీ అన్న క్యాంటీన్ విధ్వంసం.
వంటి ఘటనలతో అట్టుడికిపోయిన విషయం తెలిసిందే. """/" /
ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపారు.
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.చంద్రబాబుకు సంఘీభావంగా మండల కేంద్రాలు.
పార్టీ కార్యాలయాల్లో.సమావేశాలు పెట్టారు.
అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.ఈ ఊపంతా పార్టీని బలోపేతం చేసేందుకు ఎందుకు చూపించడం లేదనేదే ప్రశ్న.
మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇదే ఊపు కంటిన్యూ చేస్తే బాగుంటుందనేది టీడీపీ సానుభూతి పరుల మాట.
మరి నాయకులు ఇకనుంచైనా యాక్టివ్ అవుతారో లేదో చూడాలి.
అనారోగ్యాన్ని ఎదిరించి 508 కి.మీ నడక .. యువతకు స్పూర్తిగా నిలిచిన వాకింగ్ సింగ్